పేదలకు వరం కల్యాణ లక్ష్మి

52பார்த்தது
పేదలకు వరం కల్యాణ లక్ష్మి
కల్యాణ లక్ష్మి పథకం పేదింటి ఆడబిడ్డలకు కొండంత భరోసా నిస్తుందని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు, శుక్రవారం రామన్నపేట పట్టణంలోని రైతు వేదికలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. అనంతరం మండలంలోని మంజూరైన 99 కల్యాణ లక్ష్మి చెక్కులను లభ్దిదారులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల రెవెన్యూ అధికారి, మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி