నల్గొండ జిల్లాలో 648 ఎకరాల్లో పంట నష్టం

73பார்த்தது
నల్గొండ జిల్లాలో 648 ఎకరాల్లో పంట నష్టం
మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు నల్లగొండ జిల్లాలో 648 ఎకరాల్లో వరి, పత్తి, మిరప పంటలు నష్టం వాటిల్లినట్లు జిల్లా వ్యవసాయ శాఖ ప్రాథమిక అంచనా వేసింది. అందులో వరి 555 ఎకరాల్లో, పత్తి 90, మిర్చి 3 ఎకరాల్లో నీట మునిగి 33 శాతానికి పైగా పంటలకు నష్టం జరిగినట్లు వెల్లడించింది. జిల్లాలో 45 మంది రైతులకు సంబంధించి పంటలు దెబ్బతిన్నట్లు పేర్కొన్నారు. జిల్లాలో 22చోట్ల ఇండ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి.

தொடர்புடைய செய்தி