నిరుపేదలకు నిత్యావసర సరుకుల పంపిణీ చేయాలనే లక్ష్యంతో మునుగోడు నియోజకవర్గంలో గురువారం ట్రస్మా జిల్లా అధ్యక్షుడు, గాంధీజీ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు నిరుపేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. స్ధానిక గాంధీజీ విద్యాసంస్థల యందు చండూరు మున్సిపల్ వైస్ చైర్మన్ దోటి సుజాత వెంకటేష్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ చండూరు మున్సిపాలిటీ అధ్యక్షులు అనంత చంద్రశేఖర్ పాల్గొన్నారు.