పార్లమెంట్ ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు పోలీస్ శాఖ తరపున తగిన చర్యలు తీసుకుంటున్నట్లు కొండమల్లేపల్లి సిఐ ధనుంజయ గౌడ్ తెలిపారు. మంగళవారం మండల పరిధిలోని పలువురు రౌడీషీటర్లను పోలీస్ స్టేషన్కు పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహించారు ఎన్నికలకు విఘాతం కలిగిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఆయన వెంట ఎస్సై రాంమూర్తి సిబ్బంది ఉన్నారు.