రెండో రోజు కొనసాగుకున్న మూసీ ప్రక్షాళన సర్వే

69பார்த்தது
రెండో రోజు కొనసాగుకున్న మూసీ ప్రక్షాళన సర్వే
మూసీ ప్రక్షాళన కోసం ప్రభుత్వం చేపట్టిన సర్వే.. రెండోరోజు స్వల్ప ఉద్రిక్తతల మధ్య సాగింది. నదీగర్భంలో నివాసాలు ఏర్పాటు చేసుకున్న పేదలు.. ఇళ్లు ఖాళీ చేసేది లేదంటూ అధికారులతో వాగ్వాదానికి దిగారు. పలు చోట్ల రివర్ బెడ్ మార్కింగ్‌ను అడ్డుకున్నారు. హైదరాబాద్ జిల్లా పరిధిలో 59 శాతం, రంగారెడ్డి పరిధిలో 60శాతం సర్వే పూర్తైంది. ఇవాళ్టితో సర్వే పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు.