వరి పంట బోనస్ అందరికీ ఇవ్వలేదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఒప్పుకున్నారు. శనివారం నిర్వహించిన తెలంగాణ అసెంబ్లీ సమావేశంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడారు. వరి పంట బోనస్కు సంబంధించి రూ.250 కోట్ల చిల్లర బకాయిలు ఉన్నాయని, త్వరలో చెల్లిస్తామని ఆయన చెప్పారు. ఈ విషయంపై స్పష్టత ఇచ్చిన మంత్రి, రైతులకు బకాయిల చెల్లింపు గురించి హామీ ఇచ్చారు.