అమెరికా నుండి 112 మంది వలసదారులతో కూడిన మూడవ విమానం అమృత్సర్లో ఆదివారం ల్యాండ్ అయింది. ఇక వీరిలో 31 మంది పంజాబ్, 44 మంది హర్యానా, 33 మంది గుజరాత్, మరో నలుగురు ఇతర రాష్ట్రాలకు చెందిన వారు. అమెరికాలో చట్టవిరుద్ధంగా నివసిస్తున్నందుకు వారిని దోషులుగా అమెరికా ప్రభుత్వం గుర్తించింది. C-17 విమానం ద్వారా వారిని ట్రంప్ సర్కారు పంపించేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.