అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులను అరెస్టు చేయాలి

67பார்த்தது
మెదక్ జిల్లా శివంపేట మండలం కొంతాన్పల్లిలో తూప్రాన్ అంబేద్కర్ యూత్ సభ్యులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఇటీవల గ్రామంలోని అంబేడ్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబేడ్కర్ యూత్ సభ్యులు కౌన్సిలర్ మామిడి వెంకటేష్ ఆధ్వర్యంలో తరలివచ్చిన దళిత సంఘాలు అంబేడ్కర్ విగ్రహం ముందు సోమవారం ఆందోళన చేపట్టారు. విగ్రహం ధ్వంసం చేసిన దుండగులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.

தொடர்புடைய செய்தி