రుణమాఫీ కాలేదని ఆత్మహత్య చేసుకుంటానంటున్న మహిళా రైతు

85பார்த்தது
మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం కొల్చారం మండల కేంద్రంలో రైతుల ధర్నాలో ఓ మహిళా రైతు తనకు రూ. 70 వేల రుణం మంజూరు కాలేదంటూ, పురుగు మందు డబ్బాతో రైతుల ధర్నాలో గురువారం పాల్గొన్నారు. తాను ఆత్మహత్య చేసుకుంటానంటూ పురుగు మందు తాగేందుకు ప్రయత్నించారు. వెంటనే స్పందించిన పోలీసులు మందు డబ్బాను తీసుకొని ఆమెకు నచ్చజెప్పారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி