టేకుమట్లలో నేషనల్ లెవల్ మానిటర్స్ టీం పర్యటన

74பார்த்தது
టేకుమట్లలో నేషనల్ లెవల్ మానిటర్స్ టీం పర్యటన
జైపూర్ మండలంలోని టేకుమట్ల గ్రామ పంచాయతీలో బుధవారం నేషనల్ లెవల్ మానిటర్స్ టీం సభ్యులు సునీల్, బాలమురళి పర్యటించారు. ఈ సందర్భంగా ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టిన పనులు, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మహిళల కోసం చేపట్టిన చర్యలు, కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టిన పనుల వివరాలు, వాత్సల్య పథకం అమలు, తదితర అంశాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ సత్యనారాయణ, ఎంపీఓ శ్రీపతి బాపురావు, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி