గణనాధునికి 108 రకాల నైవేద్యాల సమర్పణ

81பார்த்தது
గణనాధునికి 108 రకాల నైవేద్యాల సమర్పణ
గణపతి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా నస్పూర్ మండల కేంద్రంలోని ప్రశాంతి నగర్ లో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా ఆదివారం గణనాధునికి 108 రకాల నైవేద్యాలు సమర్పించి భక్తులు తమ భక్తిపారవశాన్ని చాటుకున్నారు. పిండి వంటలు, తీపి పదార్థాలు, పండ్ల రకాలతో కలిసి 108 నైవేద్యాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించి, మొక్కులు చెల్లించుకున్నారు.

தொடர்புடைய செய்தி