మంద కృష్ణ మాదిగను కలిసిన ఎమ్మార్పీఎస్ జిల్లా నేతలు

74பார்த்தது
మంద కృష్ణ మాదిగను కలిసిన ఎమ్మార్పీఎస్ జిల్లా నేతలు
ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణ మాదిగను శుక్రవారం మంచిర్యాల జిల్లా నేతలు కలిశారు. ఈ సందర్భంగా ఎస్సీ వర్గీకరణ సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు చెన్నూరి సమ్మయ్య మాదిగ మాట్లాడుతూ, మంద కృష్ణ మాదిగ నాయకత్వంలో సుదీర్ఘ పోరాటంతో ఎస్సీ వర్గీకరణ కల సాకారమైందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కల్వల శరత్, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி