మంచిర్యాల: ఘనంగా కాకా వెంకటస్వామి జయంతి వేడుకలు

60பார்த்தது
మంచిర్యాల: ఘనంగా కాకా వెంకటస్వామి జయంతి వేడుకలు
మంచిర్యాలలోని టీఎన్జీవో భవన్ లో శనివారం కేంద్ర మాజీమంత్రి స్వర్గీయ గడ్డం వెంకటస్వామి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాకా వెంకటస్వామి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం టీఎన్జీవో జిల్లా అధ్యక్షులు గడియారం శ్రీహరి మాట్లాడుతూ, కాకా వెంకటస్వామి తెలంగాణ తొలి, మలిదశ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారని తెలిపారు. పేదల అభ్యున్నతికి, ఉమ్మడి జిల్లా అభివృద్ధికి ఎంతో కృషి చేశారన్నారు.

தொடர்புடைய செய்தி