గణేష్ మండపాలను పరిశీలించిన డీసీపీ

73பார்த்தது
మంచిర్యాల జిల్లా కేంద్రంలో జరుగుతున్న గణేష్ నవరాత్రి ఉత్సవాలను డీసీపీ భాస్కర్ శనివారం అర్ధరాత్రి పరిశీలించారు. ఏసిపి ప్రకాష్, పట్టణ ఇన్స్పెక్టర్ బన్సీలాల్ తో కలిసి స్థానిక బస్ స్టేషన్ ఎదురుగా ఉన్న వినాయక మండపంతో ఇతర ఏరియాలోని మండపాలను సందర్శించారు. ఈ సందర్భంగా మండపాల్లో తీసుకుంటున్న జాగ్రత్తలను పర్యవేక్షించారు. అనంతరం గణేష్ నిమజ్జనానికి సంబంధించి రూట్ మ్యాప్ ను తనిఖీ చేశారు.

தொடர்புடைய செய்தி