సారంగపల్లి గ్రామంలో యువ సేవ సైన్యం

1705பார்த்தது
సారంగపల్లి గ్రామంలో యువ సేవ సైన్యం
మందమర్రి మండలం సారంగపల్లి గ్రామంలో శెట్టి కృష్ణ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఇటీవల మరణించడం జరిగింది. తన మరణంతో కుటుంబం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న విషయం గ్రామంలోని సర్పంచ్, కొందరు యువకులు గమనించి సారంగపల్లి యువసేవ సైన్యం అనే గ్రూపును తయారుచేసి దాతలను విరాళాలు కోరడం జరిగింది.

దీనికి మంచి మనసుతో దాతలు స్పందించి ఇచ్చిన డబ్బులు మొత్తం 76, 000రూపాయలు, 4, 500రూపాయల నిత్యావసర సరుకులు, 3క్వీన్టల్ల25 కిలోల బియ్యం మందమరి ఎస్సై చంద్రకుమార్, జడ్పీటీసీ వేల్పుల రవి, సర్పంచ్ పర్విన్ సుల్తానాఫిరోజ్, చేతుల మీదుగా కుటుంబ సభ్యులకు అందజేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో బి. ఆర్. ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు డి. సంజీవరావు, మండల కో ఆప్షన్ నసిరోద్దిన్, మాజీ సర్పంచ్ లు కమల మనోహర్ రావు, రాజయ్య, వార్డ్ సభ్యులు, యువ సేవ సైన్యం యువకులు ఎంబడి సతీష్, పాప గౌడ్, అర్. సంతోష్ రావు, బండి ప్రసాద్, అసంపెళ్లి రాజేష్, ఎగుడ రాయమల్లు, గ్రామస్తులు, బీఆరెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி