గుండెపోటుతో వ్యాపారి మృతి

80பார்த்தது
గుండెపోటుతో వ్యాపారి మృతి
భీమారం మండల కేంద్రానికి చెందిన వ్యాపారి మాటేటి తిరుపతి(52) బుధవారం ఉదయం ఆవుడం చౌరస్తాలోని తన కిరాణా దుకాణంలో గుండెపోటుతో కుప్పకూలిపోయారు. సమీపంలోని ఆర్ఎంపీ వైద్యుడు సీపీఆర్ చేసినా ఫలితం లేకుండా పోయింది. రక్త పోటు తగ్గడంతో మంచిర్యాలకు తరలిస్తుండగా మార్గంలో మృతి చెందారు. ఆయన మృతికి సంతాపంగా మండలంలోని వర్తక వ్యాపారులు బంద్ పాటించారు.

தொடர்புடைய செய்தி