పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి

64பார்த்தது
పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి
చెన్నూర్ మున్సిపాలిటీ పరిధిలోని నాలుగవ వార్డులో అంగరాజ్ పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపు ఏర్పాటు చేశారు. పలువురికి వైద్య పరీక్షలు నిర్వహించి మందులను పంపిణీ చేశారు. కౌన్సిలర్ రేవెల్లి మహేష్ మాట్లాడుతూ, వర్షాకాలం దృష్ట్యా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జనరల్ ఫిజీషియన్ లక్ష్మీప్రసన్న, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி