మందమరి మండలంలోని తిమ్మాపూర్ ఏరియా జగదాంబేశ్వరి ఆలయంలో ఫిబ్రవరి 15 నుంచి 26 వరకు విగ్రహాల ప్రతిష్టాపన కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆలయ పూజారి తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ ఆలయ అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరు విరాళాలు అందజేసి తమ భక్తి పారశవాన్ని చాటుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మందమర్రి మండలంతో పాటుగా చుట్టుపక్కల ప్రజలు అత్యధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు.