మందమర్రిలో ఘనంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు

2083பார்த்தது
మందమర్రిలో ఘనంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు
మందమర్రి లోని పలు ఆలయాల్లో వైకుంఠ ఏకాదశి పర్వ దినాన్ని సోమవారం భక్తులు భక్తి శ్రద్దలతో ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆలయాల నిర్వాహకులు ఆలయాలను ప్రత్యేక ఆకర్షనీయంగా అలంకరించారు. పట్టణంలోని శ్రీవెంకటేశ్వరస్వామి దేవాలయంలోప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఉత్తర ద్వారం గుండా భారీ సంఖ్యలో భక్తులు దైవ దర్శనం చేసుకున్నారు. గోవింద నామంతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది. ప్రత్యేక పూజలో మందమర్రి ఏరియా జీఎం దంపతులు లక్ష్మీ శ్రీనివాస్ తో పాటు సింగరేణి అధికారులు, ప్రజాప్రతినిధులు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி