మునిసిపాలిటీ ప్రకారం ఇంటి అద్దె చెల్లించాలని ధర్నా

72பார்த்தது
మందమర్రి ఏరియాలోని కేకే ఓసీపీలో పనిచేస్తున్న క్వార్టర్ లేని కార్మికులకు మునిసిపాలిటీ ప్రకారం ఇంటి అద్దె చెల్లించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం వివిధ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం జీఎం దేవేందర్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కార్మిక సంఘాల నాయకులు మాట్లాడుతూ భూగర్భ గనిగా ఉన్నప్పుడు మున్సిపాలిటీ ప్రకారం ఇచ్చిన ఇంటి అద్దె ఓసీగా మార్చిన తర్వాత ఇవ్వడం లేదని తెలిపారు.

தொடர்புடைய செய்தி