ఇంకెన్నాళ్ళు రైతుల నిరీక్షణ!

351பார்த்தது
ఇంకెన్నాళ్ళు రైతుల నిరీక్షణ!
మంచిర్యాల జిల్లాలో పలు గ్రామాలలో అధికారులు వడ్ల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. కానీ కొన్ని గ్రామాలలో వడ్లు కల్లాలలో పేరుకుపోతున్నాయి. కన్నేపల్లి మడలంలోని వీరపూర్ గ్రామంలో ధాన్యం కల్లాలోకి చేరి నెల గడుస్తున్న ధాన్యంని చూడటానికి కానీ కొనడానికి ఇంత వరకు ఎవరూ రాలేదని రైతులు వాపోతున్నారు. అధికారులు కేవలం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిన ప్రాంతంలో మాత్రమే ధాన్యం కొనుగోలు చేస్తున్నారని మిగతా చాలా గ్రామాలలో ధాన్యం కుప్పలు కల్లాలో పేరుక పోతున్నాయని రైతులు ఆవేదన చెందుతున్నారు. అధికారులు ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలు కేవలం పేపర్ ప్రకటనలకే పరిమితమా అని రైతులు అధికారుల తీరుపట్ల ఆగ్రహంగా ఉన్నారు. ముందుగా పలు గ్రామాలలో పేరుకుపోయిన వరిధాన్యంని వెంటనే కొనుగోలు చేసి తమ నిరీక్షణకి స్వస్తి చెప్పాలని రైతులు సంభందిత అధికారులని కోరుతున్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி