అటూ భూమి పాయే....ఇటూ నష్ట పరిహారం అందక పాయే

662பார்த்தது
అటూ భూమి పాయే....ఇటూ నష్ట పరిహారం అందక  పాయే
మంచిర్యాల జిల్లాలోని కాసిపెట మండలంలోని లంబడితండా గ్రామ పంచాయతీకి చెందిన ప్రజలు కెకె 2 గనిలో భూముల కోల్పోయి ఏళ్లు గడుస్తున్న తమకి ఇంత వరకు ఎటువంటి నష్టపరిహారం అందలేదని భూనిర్వాసితులు వాపోతున్నారు. నష్ట పరిహారం కోసం భూనిర్వాసితులు అటూ కలెక్టర్ ఆఫీసుల చూట్టూ, ఇటూ ఎంపిడిఓ ఆఫీసుల చుట్టూ అలాగే ఇతర ఆఫీసుల చూట్టూ కాళ్లరిగేలా తిరిగిన అధికారులు మాత్రం వారంలో వస్తాయి, నెలలో వస్తాయి అని కబుర్లు చెప్పడం తప్పా పనులు మాత్రం ముందుకు సాగడం లేదని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. దాదాపు ఈ నష్టపరిహారం కోసం కొన్ని ఏళ్ల నుంచి తిరిగిన పరిహారం మాత్రం కావడం లేదని అటూ ఉన్న భూమిని కోల్పోయి ఇటూ నష్ట పరిహారంరాక ఆఫీసుల చుట్టూ తిరిగి తిరిగి అప్పులపాలవుతున్నాం కానీ తమ సమస్యని ఏ అధికారికానీ, ఏ ప్రజాప్రతినిదులు కూడా పట్టించుకోవడం లేదని భూనిర్వాసితులు ఆవేదన చెందుతున్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி