వనపర్తిలో సైబర్ ముఠా గుట్టురట్టు

69பார்த்தது
ముద్ర, ధని లోన్ ఫేక్ యాప్ల ద్వారా రూ. 20 లక్షల డబ్బులు కాజేసిన సైబర్ కేటుగాళ్ల ముఠాను వనపర్తి జిల్లా సైబర్ క్రైమ్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. ముఠా నుంచి రూ. 10, 00, 000 విలువైన వస్తువులు, నగదు జప్తు చేసినట్లు జిల్లా ఎస్పి రావుల గిరిధర్ తెలిపారు. 26 మొబైల్ ఫోన్లు, 22 సిమ్ కార్డులు, 5 బైక్ లు, నగదు రూ 85, 000 స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠాలో ఎనిమిది సభ్యులలో ఇద్దరు మైనర్లు ఉండడం ఓ విశేషం.

தொடர்புடைய செய்தி