యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి

71பார்த்தது
మక్తల్ పట్టణంలోని క్రీడా మైదానంలో బుధవారం ఎన్ సి సి, ప్రభుత్వ బాలుర పాఠశాల ఆధ్వర్యంలో యాంటి డ్రగ్స్ 2కే రన్ ను ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి, ట్రైనీ కలెక్టర్ గరీమా నరుల జండా ఊపి ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ. డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మించేందుకు కృషి చేయాలని యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని అన్నారు. మత్తు పదార్ధాలతో జీవితాలు నాశనం అవుతాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி