విద్యార్థులకు క్రమశిక్షణతో కూడిన విద్యను అందించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అన్నారు. గురువారం మాగనూరు మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాలను తనిఖీ చేశారు. పాఠశాలలోని తరగతి గదులను, వంట గది, ఆహార పదార్థాలను పరిశీలించారు. పదవ తరగతి విద్యార్థులు పరీక్షలను ప్రశాంతంగా రాయాలని, పరీక్షల పట్ల భయాన్ని వీడాలని చెప్పారు. ఉపాధ్యాయులు విద్యార్థులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని చెప్పారు.