విద్యార్థుల భోజనంలో నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు

84பார்த்தது
విద్యార్థుల భోజనంలో నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు
కస్తూర్బా పాఠశాలల్లో విద్యార్థులకు అందించే భోజనం విషయంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జెడ్పి సీఈవో లక్ష్మీకాంతమ్మ హెచ్చరించారు. జోగులాంబ గద్వాల జిల్లా మండల కేంద్రమైన మానవపాడు లోని కస్తూర్బా పాఠశాలను గురువారం ఆమె తనిఖీ చేశారు. విద్యార్థులకు గుడ్లు, కూరగాయలు తదితరాలను అందించకుండా మధ్యాహ్న భోజనం పెడుతున్నారని, అలా చేస్తే చర్యలు తీసుకుంటామని ఆమె మండిపడ్డారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు.

தொடர்புடைய செய்தி