రాస్తారోకో చేసిన మృతుడి బంధువులు, కుటుంబ సభ్యులు

52பார்த்தது
గద్వాల జిల్లా మండల కేంద్రమైన మల్దకల్ లో గద్వాల రహదారిపై శనివారం మృతుడి బంధువులు ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. శుక్రవారం మల్దకల్ కు చెందిన నరసింహులు (40) అనుమానాస్పద స్థితిలో వ్యవసాయ పొలం దగ్గర మృతి చెందాడు. దీన్ని హత్యగా భావించి మృతుడి బంధువులు, వారి కుటుంబ సభ్యులు, గ్రామస్తులతో కలిసి ధర్నా నిర్వహించారు. హత్య చేసిన నేరస్తులను వెంటనే పట్టుకోవాలని నినాదాలు చేశారు.

தொடர்புடைய செய்தி