దేవరకద్ర నియోజకవర్గం చిన్నచింతకుంట మండలం బండ్రవల్లి సమీపంలో శ్రీ వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి ఆదివారం సాయంత్రం వెంకటేశ్వరస్వామి వారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. స్వామివారి కృపతో నియోజకవర్గ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం స్థానిక నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.