సిగరెట్ తాగడం వల్ల మాత్రమే కాకుండా, వాయు కాలుష్యంతోనూ ఊపిరితిత్తుల క్యాన్సర్ వస్తున్నట్లు పరిశోధనలో తేలింది. దీనిపై ముంబైలోని టాటా మెమోరియల్ హాస్పిటల్కు చెందిన నిపుణులు అధ్యయనం చేపట్టారు. వారి పరిశోధనలో 1990లో ఒక లక్ష జనాభాకు 6.62 శాతం మంది క్యాన్సర్ బాధితులు ఉండగా, 2019 నాటికి అది 7.7 శాతానికి చేరింది. వాయు కాలుష్యం వల్ల క్యాన్సర్ కేసులు పెరుగుతున్నట్లు పరిశోధనలో వెల్లడైంది.