దరఖాస్తుదారుల సమక్షంలో కొనసాగుతున్న మద్యం దుకాణాల లాటరీ ప్రక్రియ (వీడియో)

67பார்த்தது
ఏపీలోని ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి విజయవాడలోని గురునానక్‌ కాలనీలో మద్యం దుకాణాల కేటాయింపు ప్రక్రియ సాగుతోంది. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి సృజన మద్యం షాపుల లాటరీ ప్రక్రియను ప్రారంభించారు. "113 మద్యం దుకాణాలకు 5,825 దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తుదారుల సమక్షంలోనే లాటరీ ప్రక్రియ నిర్వహిస్తున్నాం. మధ్యాహ్నానికి కేటాయింపులు పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నాం" అని కలెక్టర్ అన్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி