ముంబైలో పట్టాలు తప్పిన లోకల్ ట్రైన్ (వీడియో)

62பார்த்தது
ముంబైలో ఆదివారం లోకల్ ట్రైన్ రెండు కోచ్‌లు పట్టాలు తప్పాయి. దీంతో ఈ ప్రభావం పశ్చిమ రైల్వే ఆపరేషన్స్ పై పడింది. ఈ విషయం గురించి పశ్చిమ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ వినీత్ అభిషేక్ మాట్లాడుతూ.. ముంబై సెంట్రల్ నుండి కార్ షెడ్‌లోకి వెళ్తుండగా మధ్యాహ్నం 12 గంటలకు రైలు పట్టాలు తప్పాయని తెలిపారు. అలాగే పట్టాలు తప్పిన సమయంలో రైలు ఖాళీగా ఉన్నందున ఎటువంటి ప్రమాదం జరగలేదని స్పష్టం చేశారు.

தொடர்புடைய செய்தி