చెల్లితో రాఖీ కట్టించుకుని అమెరికా బయల్దేరిన కేటీఆర్

603பார்த்தது
చెల్లితో రాఖీ కట్టించుకుని అమెరికా బయల్దేరిన కేటీఆర్
తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అమెరికాకు బయల్దేరారు. నిన్న సుప్రీం కోర్టు ఆయన సోదరి కవితకు బెయిల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇవాళ సాయంత్రం కవితతో పాటు హైదరాబాద్‌కు చేరుకున్నారు. చెల్లి చేత రాఖీ కట్టించుకున్న కేటీఆర్ అనూహ్యంగా అమెరికాకు బయల్దేరారు. వారం రోజుల పాటు అమెరికాలోనే ఉండనున్నారు. అయితే ఈ పర్యటనకు ఎందుకు వెళుతున్నారో మాత్రం తెలియలేదు.

தொடர்புடைய செய்தி