టేకులపల్లికి చెందిన బాలిక(15)తో అదే గ్రామానికి చెందిన 22 ఏళ్ల యువకుడితో గత నెల 9న ఇరు కుటుంబాల పెద్దల సమక్షంలో వివాహం జరిపించారు. ఈ ఘటనపై గత నెల 28న 1098 హెల్ప్ లైను ఓ వ్యక్తి సమాచారం ఇచ్చారు. దీంతొ ఆగస్టు 31న ఐసీడీఎస్ అధికారులు గ్రామంలో విచారణ నిర్వహించారు. బాల్య వివాహం జరిగినట్లు నిర్ధారించారు. దీంతో వారిపై ఐసీడీఎస్ అధికారులు టేకులపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్సై సురేశ్ కేసు నమోదు చేశారు.