జూలూరుపాడులో సిఐటియు సంఘం ఆధ్వర్యంలో అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ ఆధ్వర్యంలో ఈ నెల 11 నుండి నిర్వహిస్తున్న నిరవధిక సమ్మెకు బుధవారం సీఐటీయూ నాయకురాలు సీత మహాలక్ష్మి సంఘీభావం తెలిపి మాట్లాడారు. అంగనవాడి టీచర్స్ ,హెల్పర్స్ను ప్రభుత్వాలు తమ అవసరాలరీత్యా అన్ని విభాగాల్లో వాడుకుంటున్నారని అన్నారు. వెంటనే అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. చెవిలో పూలు పెట్టుకొని నిరసన తెలిపారు.