చర్ల సరిహద్దు ప్రాంతమైన చతిస్గడ్ బీజాపూర్- దంతెవాడ సరిహద్దులో భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య మంగళవారం ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో 9 మంది మావోయిస్టులు మృతి చెందారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.