దుమ్ముగూడెం మండలంలో నర్సాపురం పిహెచ్సీని ప్రజారోగ్య అదనపు సంచాలకుడు అమర్ సింగ్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన జాతీయ సిటిజన్ ఎలిమినేషన్ యొక్క టెస్టుల సంఖ్య, అభా కార్డు, పాజిటివ్ వచ్చిన వారికి టీ హబ్ లో శాంపిల్స్ పంపించడం వంటి అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. డెంగ్యూ మలేరియా కేసుల గురించి ఆరా తీసారు. సీజనల్ వ్యాధులు నివారణపై సూచనలు చేశారు. ఆయన వెంట వైద్యులు, వైద్యసిబ్బంది ఉన్నారు.