గణేశ్ ఉత్సవాల పేరుతో ఎవరైనా బలవంతంగా చందాలు వసూలు చేసి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చండ్రుగొండ ఎస్సై స్వప్న శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. భక్తులు దాతృత్వంతో ఇచ్చిన కానుకలను తీసుకోవాలన్నారు. అంతేకానీ, నిర్బంధంగా ఎవరైనా చందాలకు ఒత్తిడి చేస్తే చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు.