కొడుకు మృతిని తట్టుకోలేక ఒక్కరోజు వ్యవధిలో తల్లీ తనువుచాలించిన ఘటన చంద్రుగొండ మండలం తుంగారం చోటుచేసుకుంది. గుగులోత్ సాగర్(22) ప్రేమ విఫలమై నెలన్నర క్రితం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. కొడుకుని బతికించుకునేందుకు తల్లిదండ్రులు తీవ్రంగా యత్నించారు. 20 లక్షల వరకు ఖర్చు చేసిన ఫలితం దక్కలేదు. సాగర్ శుక్రవారం మృతి చెందాడు. శనివారం ఆమె కూడా గుండె పోటుతో మృతి చెందింది.