చండ్రుగొండ మండలంలో ఉన్న వెంగళరావు ప్రాజెక్టు వరద ఉద్ధృతిని ఆదివారం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు స్థానిక ఎస్సై స్వప్నను ప్రాజెక్టుకు సంబంధించిన విషయాలు అడిగి తెలుసుకున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సూచించారు. ప్రాజెక్టు వరద ప్రవాహానికి సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడు అందించాలని సూచించారు.