కలెక్టర్ వాహనాన్ని అడ్డుకున్న మాల మహానాడు నాయకులు

66பார்த்தது
కొమురంభీం జిల్లా చింతలమానెపల్లి మండలం డబ్బా గ్రామంలో బుధవారం జిల్లా కలెక్టర్ వేంకటేశ్ దౌత్రె పర్యటించారు. డబ్బా గ్రామ మాల మహానాడు నాయకులు కలెక్టర్ వాహనాన్ని అడ్డుకొని ఎస్సీ వర్గీకరణను ఆపాలంటూ రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేస్తూ ఎస్సీ వర్గీకరణ ఆపాలంటూ నినాదాలు చేయడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. అనంతరం జిల్లా కలెక్టర్ కు వినతి పత్రాన్ని అందజేశారు.

தொடர்புடைய செய்தி