విద్యార్థులు క్రమశిక్షణ నేర్చుకోవాలి: అదనపు కలెక్టర్

58பார்த்தது
విద్యార్థులు క్రమశిక్షణ నేర్చుకోవాలి: అదనపు కలెక్టర్
కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో చదువుతున్న పిల్లలకు చిన్నతనం నుంచే విద్యతో పాటు క్రమశిక్షణ, మంచి విలువలు మొదలైనవి నేర్పించాలని అదనపు కలెక్టర్ డి. మధుసూదన్ నాయక్ సూచించారు. ఆదివారం ఏన్కూర్ మండల కేంద్రంలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యాలయంలోని కిచెన్, డార్మెటరీ మొదలగు ప్రదేశాలను అదనపు కలెక్టర్ పరిశీలించారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలన్నారు.

தொடர்புடைய செய்தி