భూకబ్జా గ్యాంగ్ లను ఉపేక్షించవద్దని మల్టీజోన్-1 ఐజిపి ఏవి రంగనాథ్ అన్నారు. వార్షిక తనిఖీలో భాగంగా మంగళవారం జిల్లాకు చేరుకున్న ఐజిపి రంగనాథ్ పోలీస్ కమీషనర్ సునీల్ దత్ తో కలసి ఖమ్మం ఖానాపురం హవేలీ పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ రికార్డులను పరిశీలించారు. సమస్య పరిష్కారం కోసం పోలీస్ స్టేషన్ లో ఇటీవల ఫిర్యాదు చేసిన బాధిత ఫిర్యాదుదారులతో ఐజిపీ నేరుగా ఫోన్లో మాట్లాడారు.