ఘనంగా వంగవీటి మోహన రంగా జయంతి వేడుకలు

82பார்த்தது
ఘనంగా వంగవీటి మోహన రంగా జయంతి వేడుకలు
జనసేన పార్టీ రఘునాథపాలెం మండల అధ్యక్షులు సచ్చు స్రవంత్ ఖన్నా అధ్యక్షతన గురువారం చిమ్మాపుడి గ్రామంలో వంగవీటి మోహన రంగా చిత్రపటానికి పుష్పమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. జనసేన మండల అధ్యక్షుడు స్రవంత్ కన్నా మాట్లాడుతూ రంగా పేద ప్రజల ఆశాజ్యోతి అని, ఆయన జీవితం అంతా పేదల కోసం అంకితం చేశారన్నారు. వంగవీటి మోహన రంగా అనే వ్యక్తి ఒక కులానికో, ఒక ప్రాంతానికో చెందిన వ్యక్తి కాదని ఆయన ఒక శక్తి అని అన్నారు.

தொடர்புடைய செய்தி