రుణమాఫీ పూర్తి స్థాయిలో చేయలేదన్న విమర్శలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పందిస్తూ.. ఏ జిల్లాలో ఎంత రుణమాఫీ జరిగిందో శాసనసభ ఆవరణలో లిస్టు పెడతామనన్నారు. శనివారం అసెంబ్లీలో మాట్లాడుతూ.. 'మేము ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తాం. జనగామ నియోజకవర్గంలో రూ.263.34 కోట్లు, గజ్వేల్ నియోజకవర్గంలో రూ.237 కోట్లు, సిద్దిపేట నియోజకవర్గంలో రూ.177.9 కోట్ల రుణమాఫీ జరిగింది. రైతు రుణమాఫీపై కావాలనే తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని అన్నారు.