సెల్ టవర్ నిర్మాణాన్ని నిలిపివేయాలి

84பார்த்தது
మధిర లడక్ బజార్ లోని మిలీనియం స్కూల్ సమీపంలో ఏటి ఒడ్డు వద్ద నూతనంగా ఏర్పాటు చేస్తున్న సెల్ టవర్ ను తొలగించాలని స్థానిక వాసులు ఆదివారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. ఇప్పటికే చాలా కుటుంబాలు వరదకు ఇబ్బంది పడ్డారని, ఇప్పుడు సెల్ టవర్ ఏర్పాటు చేస్తే రేడియేషన్ వల్ల నిత్యం అనేక మంది రోగాల సమస్యలతో ఎదుర్కోవాల్సి వస్తుందని వాపోయారు. వెంటనే సెల్ టవర్ నిర్మాణాన్ని నిలిపివేయాలని కోరారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி