యూపీఐ పేమెంట్స్లో జరుగుతున్న మోసాలను అరికట్టేందుకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) చర్యలు ప్రారంభించింది. సీక్రెట్ పిన్ నంబర్ను తెలుసుకుని మోసాలకు పాల్పడుతున్న నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకుంది. పిన్ ఆధారిత ధ్రువీకరణ ప్రక్రియకు బదులుగా బయోమెట్రిక్ ధ్రువీకరణను తీసుకురానుంది. ఈ కొత్త విధానంలో యూపీఐ లావాదేవీలను వేలిముద్ర స్కానింగ్ లేదా ఫేస్ అథెంటికేషన్ ద్వారా ధ్రువీకరించాల్సి ఉంటుంది.