ఎస్ఎల్బీసీ ప్రమాదానికి కారణం.. కేసీఆర్ అని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రమాదంపై స్పందించిన మల్లన్న ఈ ఘటనను బీఆర్ఎస్ రాజకీయం చేస్తోందని మండిపడ్డారు. కేసీఆర్ పదేళ్లు అధికారంలో ఉండి టన్నెల్ పనులు పూర్తి ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. బీఆర్ఎస్ అప్పుడే టన్నెల్ పూర్తి చేసి ఉంటే ఇప్పుడు ఈ ప్రమాదం జరిగి ఉండేది కాదని దుయ్యబట్టారు.