వైద్యురాలిపై అత్యాచార ఘటనకు నిరసనగా కొవ్వొత్తుల నిరసన ర్యాలీ

73பார்த்தது
వైద్యురాలిపై అత్యాచార ఘటనకు నిరసనగా కొవ్వొత్తుల నిరసన ర్యాలీ
కోల్కత్తాలో వైద్యురాలిపై హత్యాచార ఘటనకు నిరసనగా నేడు దేశవ్యాప్తంగా వైద్యుల ఆందోళన కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో వేములవాడ పట్టణంలోని తెలంగాణ చౌక్ వద్ద సోమవారం సాయంత్రం మదీనా మస్జీద్ యూత్ కమిటీ సభ్యులు, ఎస్టీం సభ్యులు, యువకులు కొవ్వత్తుల ర్యాలీ చేసి కొవ్వొత్తులతో నివాళి అర్పించారు. వైద్యులకు రక్షణ కల్పించాలని, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. వైద్య సిబ్బంది కోసం కొత్త చట్టం తేవాలని కోరారు.

தொடர்புடைய செய்தி