దేశ భద్రతకు సైనికులే రక్ష

80பார்த்தது
దేశ భద్రతకు సైనికులే రక్ష
మన దేశం సైనికులచే అన్ని దిక్కులలో మరియు రంగాలలో రక్షింపబడుతున్నాయని మరియు దేశ అభివృద్ధికి వారు పునాదులని అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డా. వి. నరేందర్ రెడ్డి అన్నారు. స్థానిక కొత్తపల్లిలోని అల్ఫోర్స్ ఇ-టెక్నో స్కూల్లో దేశభక్తి నింపే విధంగా మరియు స్పూర్తిదాయకంగా నిర్వహింపబడినటువంటి కార్గిల్ విజయ్ దివాస్ ఉత్సవాలకు ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు. కార్గిల్లో సైనికులు పోరాడిన విధానం మన దేశ చరిత్రలో ఒక గొప్ప అధ్యాయమని చెప్పారు. యుద్ధంలో పాల్గొన్న ప్రతి సైనికుడు అతి తక్కువ వయస్సు కలవారని జీవితాన్ని పరిపూర్ణంగా అనుభవించకుండా దేశం కోసం త్యాగం చేసి మన అందరి హృదయాలలో చరగని ముద్ర వేసుకొని మన అందరి హృదయాల్లో చోటు సంపాదించుకున్నారని చెప్పారు. కార్గిల్ వీర సైనికులచే మనమందరం రక్షింపబడ్డామని లేకపోతే పరిస్థితి ఊహించని విధంగా ఉండేదని చెప్పారు. భారత పౌరునిగా ప్రతి ఒక్కరు కార్గిల్ అమరవీరులకు పుష్పాంజలి ఘటించి దేశ భక్తి చాటాలని సలహ ఇచ్చారు.

தொடர்புடைய செய்தி