మల్లన్న సన్నిధిలో భక్తుల కోలాహలం

84பார்த்தது
మల్లన్న సన్నిధిలో భక్తుల కోలాహలం
పెద్దపల్లి జిల్లాలోని ప్రముఖ శైవక్షేత్రమైన ఓదెల శ్రీ మల్లికార్జునస్వామి ఆలయంలో ఆదివారం భక్తుల కోలాహలం నెలకొంది. తెలంగాణ ప్రాంతంతోపాటు మహారాష్ట్ర నుండి పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారి సన్నిధిలో పూజలు నిర్వహించారు. పట్నాలు, బోనాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. వేసవికాలం దృష్ట్యా ఆలయ అధికారులు భక్తుల కోసం ప్రత్యేక చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు. భక్తులకు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లను సాగించారు.

தொடர்புடைய செய்தி